Sunday, 30 August 2026

ప్రశాంతంగా ముగిసిన NEET PG పరీక్ష

ప్రశాంతంగా ముగిసిన NEET PG పరీక్ష 

ఫస్ట్ న్యూస్ 4 యు :

      ఆదివారం జరుగుతున్న NEET PG పరీక్ష నేపథ్యంలో చిత్తూరు నగరంలోని SVCET కాలేజీ పరీక్షా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ శ్రీమతి ఎస్. షాను గారు పరిశీలించారు.

పరీక్షా కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చిత్తూరు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పరీక్షా కేంద్రం పరిసరాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, అభ్యర్థుల ప్రవేశం, నిష్క్రమణ, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు.

పరీక్షా కేంద్రం పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు డ్రోన్ కెమెరాను కూడా వినియోగించారు. పరీక్షా కేంద్రం వద్ద భద్రతా ఏర్పాట్లను అడిషనల్ ఎస్పీ గారు పరిశీలించి, విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు.

పరీక్షా కేంద్రంలో నిబంధనలకు అనుగుణంగా అన్ని భద్రతా చర్యలు చేపట్టి, పరీక్షకు హాజరైన అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు సమన్వయంతో విధులు నిర్వహించారు.







No comments:

Post a Comment