సెప్టెంబర్ 1 నుండి పోలీస్ 30 యాక్ట్ అమలు
సభలు సమావేశాలు అనుమతి లేకుండా నిర్వహించరాదు
- 1 టౌన్ సీఐ చిన్న పెద్దయ్య
చిత్తూరు : ఫస్ట్ న్యూస్ 4 యు
సెప్టెంబర్-1 నుండి 30 వ తేదీ వరకు చిత్తూరు నగరంలో పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉంటుందని 1 టౌన్ సీఐ చిన్న పెద్దయ్య తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నెలరోజులపాటు చిత్తూరు నగరంలో జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉంటుందని రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు సామాన్య ప్రజలు ఎవరైనా సరే సభలు సమావేశాలు నిర్వహించాలన్న ఇతర బహిరంగ కార్యక్రమాలు నిర్వహించాలన్న పోలీసుల అనుమతి తప్పనిసరి అని తెలిపారు. రాజకీయ సభలు సమావేశాలు నిర్వహించాలంటే 72 గంటలకు ముందుగా పోలీసుల అనుమతి కోరుతూ విజ్ఞప్తి పత్రాన్ని సమర్పించాలన్నారు. పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీలు సమావేశాలు నిర్వహిస్తే 30 యాక్ట్ కింద వారి పైన కఠిన చర్యలు చేసుకుంటామని హెచ్చరించాడు.
వినాయక చవితి సందర్భంగా....
వినాయక చవితిని పురస్కరించుకొని నగరంలో వినాయక మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుల ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. పండుగ సందర్భంగా వినాయక మండపాల వద్ద ఎలాంటి డీజేలు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించరాదని భారీ స్పీకర్లతో పాటలు పెట్టడం ఇతర ప్రజలకు ఇబ్బంది కలిగించే కార్యక్రమాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. పోలీసుల అనుమతి లేకుండా వినాయక మండపాల వద్ద ఎలాంటి నిషిద్ధ కార్యక్రమాలు నిర్వహించిన వారి పైన 30 యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తప్పదని హెచ్చరించారు.

No comments:
Post a Comment