Saturday, 29 August 2026

ఆన్లైన్ యాప్ ద్వారా అప్పుల పాలై...

 ఆన్లైన్ యాప్ ల ద్వారా అప్పుల పాలైన ఓ కుటుంబం బలన్మరణానికి పాల్పడింది. 



విజయనగరం (ఫస్ట్ న్యూస్ 4 యు):

విజయనగరం జిల్లా కుమ్మరిపేటకు చెందిన వినోద్ కుమార్ (35)ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. చింతల అగ్రహారానికి చెందిన అహల్య (25) తో 2019 లో వివాహమయ్యింది. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అత్యధిక సంపాదన కోసం ఆన్లైన్ యాప్ ల ద్వారా మోసపోయి అప్పుల పాలైనారు. రాఖీ పండుగ రోజు వినోద్ కుమార్ తన తోబుట్టువుల దగ్గరికి వెళ్ళాడు. రాఖీ పండుగ ఆనందంగా జరుపుకున్నారు. వినోద్ కుమార్ సోదరుడు అప్పుల విషయం తెలుసుకొని ఆందోళన చెందవద్దని అండగా నిలుస్తామని హామీ ఇచ్చాడు. అనంతరం శుక్రవారం రాత్రి పెందుర్తిలోని తన స్వగృహానికి భార్యాభర్తలు పిల్లలతో వచ్చారు. వినోద్ కుమార్ తన ఫోన్ స్టేటస్ లో ఫ్యామిలీ ఫోటో పెట్టి RIP అని ఎంబోసిలను పెట్టి పోస్ట్ చేశాడు. ఈ పోస్టును చూసిన మేనకోడలు వినోద్ కుమార్ సోదరునికి సమాచారం ఇచ్చింది. వినోద్ కుమార్ అహల్య తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. అందరూ ఇంటికి వెళ్లి చూడగా అన్నంలో విషపూరితమైన పదార్థం కలుపుకొని భార్య పిల్లలు తినగా, వినోద్ కుమార్ ఉరివేసుకొని బలన్మరణానికి పాల్పడ్డాడు. అందరూ విగత జీవిగా కనిపించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తుని ప్రారంభించారు. 


ఆన్లైన్ యాప్ ల ద్వారా మోసపోకండి 


తెలిసి తెలియకుండా ఆన్లైన్ యాప్ ల ద్వారా డబ్బులు ఎక్కువగా వస్తుందని ఆశపడి మోసపోవద్దని పోలీసులు సూచించారు. దీనివలన చాలా కుటుంబాలు సర్వస్వం కోల్పోతున్నాయని,  బెట్టింగ్లకు ఆన్లైన్ యాప్ లకు దుర్వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.

No comments:

Post a Comment