Saturday, 29 August 2026

ఆడపిల్లలు ...జాగ్రత్త ...!

 మొబైల్ గేమ్ ద్వారా పరిచయమైన వ్యక్తి ఇంస్టాగ్రామ్ లో మరింత దగ్గరే ఆ యువతీని బ్లాక్మెయిల్ చేశాడు. కుటుంబం మొత్తం మనస్థాపం చెంది

బల్మరణానికి పాల్పడింది..24 గంటల్లో ఏం జరిగిందంటే....?




నూజివీడుకు చెందిన ఓ యువతి లూడో కం ఫన్ గేమ్ మొబైల్లో ఆడుతూ ఉండగా మహారాష్ట్రలోని సోలాపూర్ కు చెందిన రోహన్ వైకుంఠం వేముల అనే వ్యక్తి పరిచయం అయ్యాడు... అనంతరం ఇంస్టాగ్రామ్ ద్వారా మరింత చేరువయ్యాడు. ఇద్దరి మధ్య పరిచయం స్నేహంగా మారడంతో ఆ యువతిని మాయమాటల్లో పెట్టి, ఆమె ద్వారా న్యూడ్ వీడియోలను షేర్ చేసుకున్నాడు. కొన్ని రోజులు గడిచాక డబ్బు కోసం ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. డబ్బులు ఇవ్వకపోతే ఆ వీడియోలను కుటుంబ సభ్యులకు పంపిస్తానని సోషల్ మీడియాలో పెడతానని ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. చివరకు ఆ యువతి తండ్రి పుట్టినరోజు అయిన ఈ నెల 26వ తేదీన ఆయన మొబైల్కు కుటుంబ సభ్యుల మొబైల్ ఫోన్కు ఆ వీడియోలను షేర్ చేశాడు. దీంతో కుటుంబ సభ్యులు మొత్తం మనస్థాపానికి గురై బల్మరణానికి  పాల్పడడానికి సిద్ధమైనారు. చివరిగా ఈ విషయాన్ని ఆ యువతి తన స్నేహితురాలితో పంచుకుంది. ఆ స్నేహితురాలు పోలీసులకు సమాచారం ఇవ్వగా నూజివీడు పోలీసులు కుటుంబ సభ్యులను స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి ధైర్యం చెప్పారు. వారి ద్వారా ఫిర్యాదును స్వీకరించి 24 గంటల్లో ఆ వ్యక్తిని అరెస్టు చేసి ఈనెల 27వ తేదీన కోర్టు ముందు హాజరు పరచగా రిమాండ్ విధించారు.


  నెటిజన్లు అభిప్రాయం :


 ఇటీవలే రాజమండ్రిలో నూకరాజు కుటుంబం ఈ విధంగానే మృత్యువాత పడింది. ఈ ఘటన మరవకముందే నూజివీడులో ఇలా జరగడం పట్ల కొంతమంది నెటిజన్లు  దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆడపిల్లలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సోషల్ మాధ్యమాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా ఆడపిల్లల నడవడికను గమనిస్తూ ఉండాలని, ఎప్పటికప్పుడు వారికి కౌన్సిలింగ్ ఇస్తూ మంచి మార్గంలో పెంచాలని అభిప్రాయాన్ని వెల్లడించారు.

No comments:

Post a Comment