గాంధీ సర్కిల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ
ఎస్సై మహేష్ బాబు
చిత్తూరు, ఆగస్టు 31: ఫస్ట్ న్యూస్ 4 యు
గాంధీ సర్కిల్లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ట్రాఫిక్ ఎస్ఐ మహేష్ బాబు ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక చర్యలు చేపట్టారు. బస్స్టాప్ వద్ద బస్సులు నిర్దేశిత ప్రదేశాల్లోనే నిలిపేలా డ్రైవర్లకు సూచనలు చేశారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా ట్రాఫిక్ సిబ్బందితో కలిసి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు.
అదేవిధంగా వాహనదారులు, ప్రజలకు ట్రాఫిక్ నియమాలపై
అవగాహన కల్పిస్తూ పలు సూచనలు, సలహాలు అందించారు. పోలీసుల చర్యలతో గాంధీ సర్కిల్ పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గి వాహనాల రాకపోకలు సజావుగా సాగాయి. ప్రజల సౌకర్యార్థం భవిష్యత్తులోనూ ఇలాంటి ట్రాఫిక్ నియంత్రణ చర్యలు కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని కారులో వెళ్లేవారు సీటు బెల్ట్ పెట్టుకోవాలని తెలిపారు వాహనదారులు వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు.

No comments:
Post a Comment