🍁 ప్రచురణార్థం
*స్వచ్ఛభారత్, స్వచ్ఛ ఆంధ్ర పథకాలు నెహ్రూ నగర్ కు వర్తించదా?*
*జనతా వారధి లో బిజెపి డిమాండ్*
చిత్తూరు : ఫస్ట్ న్యూస్ 4 యు
చిత్తూరు నగరం
లోని మిట్టూరు 29వ డివిజన్ నందు గల నెహ్రూ నగర్ లో దాదాపు ఒక సంవత్సరం నుండి అన్ని వీధుల ద్వారా వచ్చే మురికి నీరు డ్రైనేజీ కాలువలు సక్రమంగా లేని కారణంగా ఒకచోట నిలిచిపోయి ఆ ప్రాంతమంతా దుర్గంధంగా తయారయింది. సరైన అవుట్ లెట్ లేని కారణంగా ఈ సమస్య ఏర్పడింది.
భారతీయ జనతా పార్టీ పలుమార్లు మునిసిపల్ అధికారులకు నివేదించిన తర్వాత కమిషనర్ , మునిసిపల్ సిబ్బంది నెహ్రూ నగర్ ప్రాంత పర్యటన చేశారు. తదుపరి జిల్లా కలెక్టర్ కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలించి తగిన ఆదేశాలు జారీ చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు.
నేడు జనతా వారధి కార్యక్రమం ద్వారా బిజెపి స్టేట్ ఎగ్జిక్యూటివ్ చిట్టిబాబు కొల్లా నగరపాలక కమిషనర్ ను ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో కలిసి నెహ్రూ నగర్ కాలువ సమస్యను నివేదించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ఏం జి రామభద్ర, పాండురంగం, నాగరాజ తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment