Sunday, 6 September 2026

అరగొండ అపోలో హాస్పిటల్ లో న్యూరో సర్జరీ వైద్య నిపుణులచే వైద్య చికిత్స శిబిరం

 అరగొండ అపోలో హాస్పిటల్ లో న్యూరో సర్జరీ వైద్య నిపుణులచే వైద్య చికిత్స శిబిరం

చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు 


తవణంపల్లి సెప్టెంబర్ 5 తవణంపల్లి మండలం అపోలో అరగొండ హాస్పటల్ నందు సెప్టెంబర్ 6 ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1:00 వరకు ప్రముఖ వైద్య సర్జన్ నిపుణులు డాక్టర్ సాయినాథ్ వారి బృందం వైద్య నిపుణులచే తలలోని గడ్డలు .తల గాయాలు. మెడ నొప్పి .సయాటికా. వెన్నునొప్పి .వెన్నుముక డిస్క్ సమస్య. వెన్నుపూస గాయాలు. పీడియాట్రిక్ న్యూరో సర్జరీ, వాస్కులర్ న్యూరో సర్జరీ, క్లిప్పింగ్ రక్తనాళా బుడగ క్లిప్పింగ్ ఎం .వి. డి పర్ ట్రై జమినల్ న్యూరో ల్దియావర్ది బ్రో ప్లాలిష్టి కైపాప్లాష్టి పక్షవాతము  డికం ప్ర ష న్ సర్జరీ కోత కట్టు లేకుండా మెదడు మరియు వెన్నుముక ఆపరేషన్ చికిత్స శిబిరం జరిగింది మొత్తం 25 మంది హాజరయ్యారు ఇందులో న్యూరో సర్జరీస్ నాలుగు మంది సెలెక్ట్ చేసి వీరిని రాయితీతో చికిత్స చేయడం జరుగుతుందని  అరగొండ అపోలో హాస్పటల్ పి ఆర్ ఓ కమ్రుద్దీన్ తెలిపారు

Saturday, 5 September 2026

జర్నలిస్టుల ప్రతిభకు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం*


 జర్నలిస్టుల ప్రతిభకు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం*
*2025 ఉత్తమ జర్నలిస్టు అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం – 12 విభాగాల్లో పురస్కారాలు*
*రూ.2 లక్షల నుంచి రూ.1 లక్ష వరకు నగదు పురస్కారాలు – సెప్టెంబరు 28లోగా దరఖాస్తులు*
*రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్. విశ్వనాథన్*

చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు 



చిత్తూరు, సెప్టెంబరు 6, :  జర్నలిజం రంగంలో విశేష సేవలందిస్తూ, వృత్తిపరమైన ప్రతిభను కనబరిచిన పాత్రికేయులను ప్రోత్సహించి, వారి సేవలను గుర్తించి గౌరవించేందుకు 2025 సంవత్సరానికి 12 విభాగాల్లో ఉత్తమ జర్నలిస్టు అవార్డులు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అవార్డులకు అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు ఆయా విభాగాలకు చెందిన జర్నలిస్టుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్. విశ్వనాథన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.


అర్హులైన జర్నలిస్టులు తమ దరఖాస్తులను 2026 సెప్టెంబరు 28వ తేదీ సాయంత్రం 5.00 గంటల్లోగా కింది చిరునామాకు పంపించాలని ఆయన సూచించారు.


డైరెక్టర్,

సమాచార పౌరసంబంధాల శాఖ,

2వ అంతస్తు, ఎన్టీఆర్ పరిపాలన భవనం,

పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్,

విజయవాడ – 520013.


*కమిటీ విచక్షణాధికారంతో ఎంపిక చేసే పురస్కారాలు*


కింది మూడు పురస్కారాలకు జర్నలిస్టుల నుంచి ప్రత్యేకంగా దరఖాస్తులు స్వీకరించకుండా, ఎంపిక కమిటీ తన విచక్షణాధికారంతో పురస్కార గ్రహీతలను ఎంపిక చేస్తుంది.

1. వి.ఆర్. నార్ల జీవిత సాఫల్య పురస్కారం

2. కొక్కు అహోబలరావు ఉత్తమ ఫోటో జర్నలిస్టు అవార్డు

3. మద్దూరి అన్నపూర్ణయ్య పేరిట రాష్ట్రంలోని చిన్న, మధ్యతరహా వార్తాపత్రికల సంపాదకులకు అందించే అవార్డు


*దరఖాస్తుల ఆధారంగా కమిటీ ఎంపిక చేసే అవార్డులు*


1. కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు ఉత్తమ జర్నలిస్టు అవార్డు


నగదు పురస్కారం: రూ.2 లక్షలు


అర్హతలు:

జర్నలిజం వృత్తిలో కనీసం 10 సంవత్సరాల అనుభవం కలిగి, వృత్తిపరమైన ప్రతిభను కనబరిచిన పూర్తికాలపు జర్నలిస్టులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రచురితమవుతున్న పేరొందిన తెలుగు, ఆంగ్ల వార్తాపత్రికలు లేదా పీరియాడికల్స్‌ కోసం ఆంధ్రప్రదేశ్‌లో లేదా రాష్ట్రం వెలుపల పనిచేస్తున్న జర్నలిస్టులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.


2. ఉత్తమ గ్రామీణ జర్నలిస్టు అవార్డులు


గ్రామీణ జర్నలిజంలో విశేష ప్రతిభ కనబరిచిన ముగ్గురు జర్నలిస్టులకు ప్రముఖ పాత్రికేయుల పేర్లతో మూడు అవార్డులు అందజేస్తారు.


- ఖాసా సుబ్బారావు ఉత్తమ గ్రామీణ జర్నలిస్టు అవార్డు

- ముట్నూరి కృష్ణారావు ఉత్తమ గ్రామీణ జర్నలిస్టు అవార్డు

- మద్దుకూరి చంద్రశేఖరరావు ఉత్తమ గ్రామీణ జర్నలిస్టు అవార్డు


ఒక్కో అవార్డు నగదు పురస్కారం: రూ.1 లక్ష


అర్హతలు:

ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రచురితమవుతున్న తెలుగు, ఆంగ్ల దినపత్రికల్లో గ్రామీణ ప్రాంతాల్లో కనీసం 3 సంవత్సరాల అనుభవం కలిగిన పాత్రికేయులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. గ్రామీణ రిపోర్టింగ్‌లో విశేష అనుభవం గడించిన మాజీ జర్నలిస్టులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.


3. సావిత్రిబాయి పూలే ఉత్తమ మహిళా జర్నలిస్టు అవార్డు


నగదు పురస్కారం: రూ.1 లక్ష


అర్హతలు:

రాష్ట్రంలో వెలువడే తెలుగు, ఆంగ్ల వార్తాపత్రికలు లేదా పీరియాడికల్స్‌లో పనిచేస్తున్న మహిళా రిపోర్టర్లు, డెస్క్ జర్నలిస్టులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.


4. ఉత్తమ కార్టూనిస్టు అవార్డు


నగదు పురస్కారం: రూ.1 లక్ష


అర్హతలు:

ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రచురితమవుతున్న తెలుగు, ఆంగ్ల దినపత్రికల్లో పనిచేస్తున్న కార్టూనిస్టులు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 10 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.


5. అబుల్ కలాం ఆజాద్ ఉత్తమ ఉర్దూ జర్నలిస్టు అవార్డు


నగదు పురస్కారం: రూ.1 లక్ష


అర్హతలు:

ఉర్దూ పత్రికల్లో జర్నలిస్టుగా పనిచేస్తూ కనీసం 10 సంవత్సరాల అనుభవం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉర్దూ జర్నలిజానికి అందించిన సేవలు, గ్రామీణ ప్రాంతాల సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై చేసిన రిపోర్టింగ్‌, మొత్తం వృత్తిపరమైన పనితీరును ప్రామాణికంగా తీసుకుని అవార్డు గ్రహీతను ఎంపిక చేస్తారు.


6. ఉత్తమ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు అవార్డు


నగదు పురస్కారం: రూ.1 లక్ష


అర్హతలు:

కనీసం 5 సంవత్సరాల అనుభవం కలిగి, ఆంధ్రప్రదేశ్‌లో ప్రసారమయ్యే ఎలక్ట్రానిక్ మీడియా ఛానళ్లు, కేబుల్ నెట్‌వర్క్‌లలో పనిచేస్తున్న జర్నలిస్టులు దరఖాస్తు చేసుకోవచ్చు. దూరదర్శన్‌, రేడియోలో పనిచేస్తున్న జర్నలిస్టులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.


7. ఉత్తమ వీడియో జర్నలిస్టు అవార్డు


నగదు పురస్కారం: రూ.1 లక్ష


అర్హతలు:

కనీసం 5 సంవత్సరాల అనుభవం కలిగి, ఎలక్ట్రానిక్ మీడియా ఛానళ్లలో పనిచేస్తున్న వీడియో జర్నలిస్టులు దరఖాస్తు చేసుకోవచ్చు.


దరఖాస్తు విధానం – ముఖ్య నిబంధనలు


* జర్నలిస్టులు తాము పనిచేస్తున్న సంస్థ, ఉద్యోగ వివరాలు, తమ అర్హతలకు సంబంధించిన పూర్తి వివరాలతో వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకోవాలి.


* దరఖాస్తుతో పాటు కనీసం 5 వ్యాసాలు, వార్తా కథనాలు, ఫొటోలు, కార్టూన్లు లేదా వీడియో క్లిప్పింగ్స్‌ జతచేయాలి. అవి 2025 క్యాలెండర్ సంవత్సరంలో (01-01-2025 నుంచి 31-12-2025 వరకు) ప్రచురితమైనవి/ప్రసారమైనవి అయి ఉండాలి.


* వ్యాసాలు, వార్తా కథనాలు తదితర ఆర్టికల్స్‌ను ఫొటోకాపీల రూపంలో కూడా దాఖలు చేయవచ్చు.


* అవార్డు గ్రహీతల ఎంపికకు సంబంధించి ఎంపిక కమిటీదే తుది నిర్ణయం. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు అనుమతించబడవు.


* ఏదైనా విభాగంలో తగిన సంఖ్యలో లేదా తగిన ప్రమాణాలతో దరఖాస్తులు అందలేదని కమిటీ భావించినట్లయితే, సంబంధిత అవార్డును ప్రకటించకుండా నిలిపివేసే అధికారం ఎంపిక కమిటీకి ఉంటుంది.


* ఉత్తమ జర్నలిస్టు పురస్కారాలకు సంబంధించిన అర్హతలు, దరఖాస్తు విధానం, ఇతర నిబంధనలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సమాచార పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలోని మీడియా రిలేషన్స్ వెబ్‌సైట్‌లో పరిశీలించవచ్చు:  (https://mediarelations.ap.gov.in/media)



ఇద్దరు దొంగలు అరెస్ట్

*వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితుల అరెస్ట్ – రూ.13 లక్షల విలువైన బంగారం, వెండి, నగదు స్వాధీనం చేసుకున్న కల్లూరు పోలీసులు.*

*జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులు.*

చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు 



కల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని 106 రామిరెడ్డిగారిపల్లి గ్రామానికి చెందిన ఎం. శంకర్ రెడ్డి ఇంటిలో 15.05.2026 రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి 8 గ్రాముల బంగారు చైన్ మరియు రూ.20,000/- నగదు దొంగతనం చేసిన ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కల్లూరు పోలీస్ స్టేషన్‌లో Cr.No.47/2026 U/s 331(4), 305(a) BNS కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


దర్యాప్తులో భాగంగా చిత్తూరు ఫింగర్ ప్రింట్స్ బ్యూరో సిబ్బందిని సంఘటనా స్థలానికి రప్పించి పరిశీలించగా, అక్కడ లభించిన వేలిముద్రలు రొంపిచెర్ల మండలం దద్దాలవారిపల్లికి చెందిన ఆవులకుంట నరేష్‌కు సంబంధించినవిగా గుర్తించారు.



చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS., గారి ఆదేశాల మేరకు, చిత్తూరు ఎస్.డి.పి.ఓ శ్రీ జె.వెంకటనారాయణ గారి ఆధ్వర్యంలో, కల్లూరు సి.ఐ. శ్రీ యం.జయరామయ్య గారి పర్యవేక్షణలో, కల్లూరు ఎస్.ఐ. శ్రీ యు.వెంకటేశ్వర్లు గారు దర్యాప్తు కొనసాగించారు.


ఈ క్రమంలో 05.09.2026 సాయంత్రం 05.00 గంటల సమయంలో పోలీసులకు అందిన ఖచ్చితమైన సమాచారం మేరకు పులిచెర్ల రైల్వే స్టేషన్ వద్ద ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.


నిందితులను విచారించగా, ప్రధాన నిందితుడు ఆవులకుంట నరేష్ 2025 సంవత్సరంలో కొత్తపేటలో అబ్దుల్ మునాఫ్ ఇంటిలో, కల్లూరు–పులిచెర్ల రహదారిలో వగాళ్లవారిపల్లి సమీపంలోని ఎల్లమ్మ గుడిలో, 106 రామిరెడ్డిగారిపల్లిలో, బలిజిపల్లిలోని ఏకాంబరం ఇంటిలో దొంగతనాలకు పాల్పడినట్లు నేరం అంగీకరించాడు.


అదేవిధంగా పీలేరు పరిధిలోని ఒక ఆలయంలో, చంద్రగిరి మండలంలోని మరో ఆలయంలో కూడా దొంగతనానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది.


ఈ దొంగతనాల్లో పిన్న బోయున శ్రీనివాసులు నిందితుడు నరేష్‌కు సహకరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దొంగతనం చేసిన బంగారు వస్తువులను వివిధ బంగారు దుకాణాల్లో విక్రయించి, వచ్చిన డబ్బుతో ఇద్దరూ జల్సాలు చేసేవారని విచారణలో వెల్లడైంది.


వీరి వద్ద నుండి రూ.2,42,000/- నగదు, 78 గ్రాముల బంగారం, 30 గ్రాముల వెండి మొత్తం విలువ సుమారు *రూ.13,00,000/- విలువ సొత్తును స్వాదీనం చేసుకున్నారు.


నిందితులను అరెస్ట్ చేసి, స్వాధీనం చేసుకున్న దొంగసొత్తును రికవరీ చేసిన కల్లూరు పోలీసులను జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS గారు అభినందించారు.


*ముద్దాయిల వివరాలు:*

1. ఆవులకుంట నరేష్, వయస్సు 36 సంవత్సరాలు, తండ్రి: సుబ్రమణ్యం, దద్దాలవారిపల్లి గ్రామం, రొంపిచెర్ల మండలం.

2. పిన్న బోయున శ్రీనివాసులు, వయస్సు 24 సంవత్సరాలు, తండ్రి/సంరక్షకురాలు: సుభాషిణి, బద్వేల్, కడప జిల్లా, ప్రస్తుతం తిరుపతి అక్కరంపల్లి, మంగళం రోడ్డులో నివాసం.

విద్యార్థులందరూ చిట్టిగులుగా మారాలి - నిరక్షరాస్యతను రూపుమాపాలి*

 *విద్యార్థులందరూ చిట్టిగులుగా మారాలి - నిరక్షరాస్యతను రూపుమాపాలి*




అక్షరాస్యత పక్షోత్సవాలలో భాగంగా ఈరోజు చిత్తూరు ప్రభుత్వ కన్నన్ జూనియర్ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు *"వయోజనులకు అక్షరాస్యత ఆవశ్యకత - సమాజంలో అక్షరాస్యత యొక్క ప్రాముఖ్యత"* అను అంశాలకు సంబంధించి చర్చ గోష్టిని ఏర్పాటు చేయడం జరిగినది . 


ఈ సందర్భంగా వయోజన విద్య ఉపసంచాలకులు మహమ్మద్ ఆజాద్ వయోజనులకు అక్షరాస్యత ప్రాముఖ్యతను గురించి విద్యార్థులకు వివరంగా చెప్పడం జరిగింది . అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులలో నిరక్షరాస్యులుగా ఉన్నవారికి మరియు విద్యార్థుల పరిసరములలో ఉన్న నిరక్షరాశులకు విద్యార్థులే చిట్టి గురువులుగా మారి చదువు నేర్పించాలని కోరారు . 


ఈ చర్చ గోష్టి లో విద్యార్థులు చాలా చురుకుగా పాల్గొనడం జరిగినది . ఈ కార్యక్రమంలో కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపల్ శ్రీమతి నాగవల్లి గారు మాట్లాడుతూ అక్షరాస్యత అమలు కోసం ఇదివరకు అక్షర సంక్రాంతి , అక్షర తపస్మాన్ , అక్షర యజ్ఞం లాంటి అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అన్నారు . ప్రస్తుతం అక్షర ఆంధ్ర కార్యక్రమంలో విద్యార్థులు కూడా పాల్గొని తమ వంతు సహకారం ఈ కార్యక్రమానికి అందించవలసిందిగా కోరడం జరిగినది . 


ఇందులో భాగంగా ప్రతి విద్యార్థి చిట్టి గురువుగా మారి తన పరిసరములలో ఉన్న ఒక నిరక్షరాస్యునికి చదువు చెప్పాలని కోరారు . ఈ కార్యక్రమంలో వయోజన విద్య పర్యవేక్షకులు కందేశ్వర రావు మాట్లాడుతూ  ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో విద్యార్థులు అందరూ కూడా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు . అనంతరం కళాశాల విద్యార్థినీ విద్యార్థులతో అక్షరాస్యతకు సంబంధించిన నినాదాలు చెబుతూ ర్యాలీని నిర్వహించడం జరిగినది . ఈ కార్యక్రమంలో వయోజన విద్యాశాఖ సిబ్బంది, ప్రభుత్వ జూనియర్ కళాశాల సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు .

ఓలా - ఉబర్- రాపిడో- బైక్ టాక్సీ లను రద్దు చేయాలి

 ఓలా - ఉబర్- రాపిడో- బైక్ టాక్సీ లను రద్దు చేయాలని కోరుతూ 7వ తేదీన జరిగే ధర్నా లో ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున పాల్గొనాలి  

          ఏఐటీయూసీ పిలుపు 

చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు:





 ఆటో డ్రైవర్ల సమస్యలతో పాటు ఓలా, ఉబర్, రాపిడో బైక్ టాక్సీలను రద్దు చేయాలని కోరుతూ సెప్టెంబర్ నెల 7వ తేదీన సోమవారం ఉదయం 10 గంటలకు  మహాత్మా గాంధీ విగ్రహం వద్ద


 ఏఐటియుసి ఆధ్వర్యంలో జరిగే ఆటో డ్రైవర్ల  ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం  కాంక్షిస్తూ చిత్తూరు భగత్ సింగ్ స్టాండ్ వద్ద ఏఐటీయూసీ నాయకత్వంలో కరపత్రాలు నాయకులు విడుదల చేశారు 


ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా ఆటో డ్రైవర్ యూనియన్ గౌర అధ్యక్షులు ఎస్. నాగరాజు చిత్తూరు జిల్లా ఆటో డ్రైవర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎం.విజయ్ కుమార్ లు మాట్లాడుతూ   ఓలా ఉబర్ రాపిడో  బైక్  టాక్సీ లను యాప్ ఆన్లైన్ ద్వారా నడపడం వల్ల  ఆటో డ్రైవర్ల బ్రతుకులు చిన్నాభిన్నమవుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు ఆటో డ్రైవర్లకు రోజువారి ఆదాయం లేక డ్రైవర్లు ఫైనాన్స్ కంపెనీల్లో  కంతులు చెల్లించలేక అప్పుల పైన అప్పులు చేసి తన కుటుంబాన్ని  పోషించలేని పరిస్థితుల్లో ఉన్నారని వాపోయారు  ఇలాగనే కొనసాగితే ఆటో డ్రైవర్ల  కుటుంబాలు వారి బతుకులు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆవేదన  చెందారు మన బ్రతుకు కొరకు మన బ్రతుకు కోసం  సెప్టెంబర్ 7వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఆటో డ్రైవర్లు  నిర్వహించే  నిరసన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు  పెద్ద ఎత్తున  పాల్గొని గాంధీ విగ్రహం వద్ద నుండి చిత్తూరు నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ గురుజాల జగన్మోహన్ ఎమ్మెల్యే గారికి ఆటో డ్రైవర్ల బాధలను తెలియజేసి  వినతి పత్రం సమర్పించే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆటో డ్రైవర్లకు పిలుపునిచ్చారు


 ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర కార్యదర్శి దాసరి చంద్ర, కే.మణి,వి. సి. గోపినాథ్,చిత్తూరు ఆటో డ్రైవర్స్ యూనియన్ కోశాధికారి పి.రఘు యూనియన్ ఉపాధ్యక్షులు శివకుమార్, డిహెచ్పిఎస్ నాయకులు పి. గజేంద్రబాబు ఆటో యూనియన్ నాయకులు సామెల్, యేసు, జయ కుమార్,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

ఉపాధ్యాయురాలు సురేఖకు ఉత్తమ అవార్డు

 మానసిక విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన
ఉపాధ్యాయురాలు సురేఖకు ఉత్తమ అవార్డు 
సిఐటియు అభినందనలు
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు 

ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పడంలో విశిష్ట సేవలు అందించిన జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు అందుకున్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి గిరిధర్ గుప్తా సతీమణి సురేఖకు సిఐటియు నుంచి అభినందనలు 



శనివారం చిత్తూరు జడ్పీ సమావేశ మందిరంలో ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా గంగవరం మండలంలో వికలాంగుల విద్యార్థిని విద్యార్థులకు విద్య నేర్పించడంలో అత్యుత్తమ సేవలందించిన ఉపాధ్యాయురాలు సురేఖకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు అందుకోవడం అభినందనీయం. జిల్లాలో మొత్తం 75 మందికి ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు ఉత్తమ అవార్డులు అందించడం జరిగింది. వివిధ రకాల రంగాలలో సేవలు అందించిన వారికి డాక్టర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదిన సందర్భంగా ఈ అవార్డులు ప్రధానం చేశారు. మామూలు పిల్లలకు విద్య నేర్పడం ఒక రకం అయితే మానసిక విద్యార్థులకు చదువు నేర్పడం మరో ఎత్తు అని పలువురు కొనియాడారు. చాలా కష్టంతో కూడుకున్న పని అయినప్పటికీ చాలా ఓపికతో మానసిక విద్యార్థిని విద్యార్థులకు చదువు చెప్పిన ఉపాధ్యాయురాలు  సురేఖ గొప్ప ఉపాధ్యాయురాలని కొనియాడారు. ఆమె అందరికీ ఆదర్శం అన్నారు.ఈమెను ఆదర్శవంతంగా తీసుకొని మిగిలిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కూడా పిల్లల భవిష్యత్తుకు కృషి చేయాలని తెలిపారు. 

ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు అందుకున్న సురేఖకు సిఐటియు జిల్లా కమిటీ నుంచి అభినందనలు తెలిపిన వారిలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి గిరిధర్ గుప్తా జిల్లా ఉపాధ్యక్షుడు వాడ గంగరాజు ,మాజీ జిల్లా కార్యదర్శి సురేంద్రన్ తదితరులు పాల్గొన్నారు

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

 గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు 



చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం గుండ్లకట్టమంచి వద్ద జాతీయ రహదారిపై పొలం దగ్గర నుండి ఇంటికి వెళ్లేందుకు రోడ్డు ప్రక్కన నిల్చుని ఉండగా పలమనేరు వైపు నుండి చిత్తూరు వైపు వెళుతున్న వాహనం ఢీకొని సుమారు 20మీటర్ల దూరం లాక్కొని వచ్చి వెళ్లిపోవడం జరిగింది.ఈ ప్రమాదంలో గుండ్లకట్టమంచి హరిజన వాడకు చెందిన వెంకటేష్ అనే వ్యక్తి మృతి చెందడం జరిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.