Monday, 31 August 2026

నూతన ఎస్సైగా వెంకటసుబ్బయ్య

చిత్తూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్‌.ఐ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ సి.వెంకట సుబ్బయ్య.

చిత్తూరు : ఫస్ట్ న్యూస్ 4 యు 



 సోమవారం చిత్తూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో  నూతన ఎస్.ఐ గా బాధ్యతలను సి.వెంకట సుబ్బయ్య  స్వీకరించారు.అనంతరం చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి నీ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టూ టౌన్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి చర్యలు చేపడతామన్నారు. సీఐ పర్యవేక్షణలో ఆయన సూచనల మేరకు స్టేషన్లో ఎలాంటి కేసులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. దొంగతనాలు దోపిడీలు జరగకుండా రాత్రి కత్తి నిఘాను మరింత పటిష్టంగా అమలు చేస్తామన్నారు. సమస్యల కోసం వచ్చే ప్రజలకు న్యాయం చేస్తామన్నారు. 

No comments:

Post a Comment