Monday, 31 August 2026

ట్రైనింగ్ పేరుతో లక్షల స్వాహా

 ట్రైనింగ్ పేరుతో లక్షల స్వాహా 


అంగన్వాడీలకు ఇవ్వని బిల్లులు 

స్వాహా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి 

- యూనియన్ గౌరవాధ్యక్షుడు వాడ గంగరాజు డిమాండ్ 

చిత్తూరు: ఫస్ట్ న్యూస్ 4 యు 


అంగన్వాడీలకు జ్ఞాన జ్యోతి పేరుతో ఆరు రోజులు పాటు ట్రైనింగులు జరిపి వాటికి కావలసిన భోజనాలు మెటీరియల్ ట్రావెలింగ్ సౌకర్యాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు వరకు బడ్జెట్ కేటాయించింది. అయితే ఈ బడ్జెట్లో ట్రైనింగ్ సందర్భంగా అంగన్వాడీలకు నాశ్రికం భోజనాలు పెట్టి మిగతా వాటి బిల్లు లు సంబంధిత అధికారులు లక్షల్లో స్వాహా చేసినట్లు తెలుస్తున్నది. వీటిపై విచారణ చేసి వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా గౌరవాధ్యక్షుడు వాడ గంగరాజు డిమాండ్ చేశారు 


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెలలో మూడు రోజులకు ఒకసారి మూడు రోజులు ఒకసారి మొత్తం ఆరు రోజులకు అన్ని ప్రాజెక్టులలో జ్ఞాన జ్యోతి పేరుతో అంగన్వాడీలకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణ సందర్భంగా చార్టులు, భోజనాలు ,చార్జీలు ఐదు రకాల వాటికి ప్రభుత్వం పట్టిక ఇచ్చి ఒక్కొక్క దానికి ఒక ధర నిర్ణయించి ఇవ్వడం జరిగింది. భోజనాలకి రోజుకి 200 రూపాయలు కేటాయించగా మధ్యాహ్నం ఒక పూట మాత్రమే పెట్టి నాసిరకమైన భోజనం పెట్టారు. చార్టులు మిగతా అలవెన్సులు ఏవి కూడా రాలేదు గతంలో అంగన్వాడీలకు శిక్షణ పూర్తి అయిన వెంటనే చార్జీలు ఇతర ఖర్చులు ఇచ్చేవారు. అయితే ఇప్పుడు శిక్షణ పూర్తయి వారం రోజులు అవుతున్న ప్రాజెక్ట్ అధికారులు బడ్జెట్ రాలేదని చెప్తున్నారు. బడ్జెట్ రాకపోతే అక్కడ ఏర్పాట్లు ఎలా చేశారని ఆయన ప్రశ్నించారు. జిల్లా నుంచి  ప్రాజెక్టు అధికారుల అకౌంట్కి జమ చేశారు. అయినా కిందిస్థాయిలో అంగన్వాడీలకు ఇవ్వకుండా  జిల్లాలో  2400 మంది వర్కర్లు ఉంటే  ఒక్కొక్కరికి  తక్కువ అంటే 600 రూపాయల లెక్కన లెక్క వేసిన 14 లక్షల పైన స్వాహా అయినట్లు తెలుస్తుంది. వేలకు వేలు జీతాలు తీసుకునే అధికారులే అతి తక్కువ వేతనాలు తీసుకుంటున్న వారి నుండి బిల్లులు లేకుండా దోచుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రతి దాంట్లోనూ కమీషన్లు ఇవ్వందే ఐసిడిఎస్ లో పని జరగడం లేదు. పైన ఒకటి చెప్తారు కింద ఒకటి జరుగుతుంది అంగన్వాడీల సమస్యలపై జాయింట్ సమావేశం నిర్వహించమని పదేపదే అడుగుతున్న ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. ప్రతి చిన్న విషయంలోనూ కిందిస్థాయి వర్కర్లకు మెమోలు మీద మెమోలు ఇస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు తప్ప ఇలాంటి వాటిపై దృష్టి పెట్టడం లేదు. ప్రభుత్వ ధనాన్ని ఇష్టారాజ్యంగా స్వాహా చేస్తున్న అధికారులపై జిల్లా ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఐసిడిఎస్ కి జిల్లా చైర్మన్గా కలెక్టర్ ఉన్నప్పటికీ అవినీతిపై భరతం పడుతున్న కలెక్టర్ ఐ సి డి ఎస్ లో అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అని అర్థం కావడం లేదు. వర్కర్ హెల్పర్ ఏదైనా చిన్న తప్పు చేస్తే భూతద్దంలో చూసే అధికారులు ఈ విధంగా వర్కర్లకు రావాల్సిన డబ్బులను లక్షలలో స్వాహా చేస్తుంటే ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు ఈ బిల్లులపై విచారణ చేపట్టి అంగన్వాడీలకు రావలసిన డబ్బులను చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు

No comments:

Post a Comment