మట్టి మాఫియా పై చర్యలు తీసుకోవాలి
పర్యావరణాన్ని కాపాడాలి
సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు డిమాండ్
జిల్లాలో మట్టు మాఫియా ఇష్టారాజ్యంగా గుట్టలు గుట్టలన్నిటిని ధ్వంసం చేస్తూ మట్టిని రియల్ ఎస్టేట్ ప్యాట్లకు తరలిస్తూ పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నదని మట్టి మాఫియా పై చర్యలు తీసుకుని పర్యావరణాన్ని కాపాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు డిమాండ్ చేశారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నగిరి, జీడి నెల్లూరు, బంగారుపాలెం నియోజకవర్గాల్లో అత్యధికంగా మట్టి మాఫియా రెచ్చిపోతున్నది. రియల్ ఎస్టేట్ ప్లాట్లకు ప్రభుత్వ స్థలాల్లో ఉన్న గుట్టలను ధ్వంసం చేసి రాత్రి పగలు తేడా లేకుండా హిటాచిలతో భారీ స్థాయిలో ట్రాక్టర్లతో ,ట్రిప్పర్లతో మట్టిని తరలిస్తున్నారని తెలిపారు. ఒకపక్క పర్యావరణ దెబ్బతింటు మరోపక్క చుట్టుపక్కల గ్రామస్తులు మట్టికి దుమ్ముదూళితో అనారోగ్యాలతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది .వారి వ్యాపారం కోసం ప్రభుత్వ, పేదల ఆస్తి అయినా గుట్టలను అక్రమంగా ఉచితంగా మట్టిని తరలిస్తూ ధ్వంసం చేస్తున్నారు .ఇంత జరుగుతున్న రెవెన్యూ అధికారులు ఏమాత్రం పట్టి పట్టనట్లు ఉన్నారు పంచాయతీల ఆదాయాన్ని గడ్డి కొడుతూ కోట్లు గడిస్తున్న మట్టి మాఫియా పై ఎందుకు చర్యలు తీసుకోలేదు అని ఆయన ప్రశ్నించారు. దీని వెనక స్థానిక ప్రజా ప్రతినిధులు ఉన్నారని బహిరంగ రహస్యం. వారిని సంతృప్తి పరచడానికి అధికారులు ఆరాటడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత ప్రజాప్రతినిధులందరూ గత ప్రభుత్వం అవలంబించిన ఇలాంటి మాఫియా పనులను వ్యతిరేకించిన ప్రస్తుత కూటమి పాలకులు నేడు యదేక్షగా వారి వ్యాపారాలను వారి ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రభుత్వ ఆస్తులను దోచుకుంటున్నారనేది నగ్నసత్యం. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై మట్టి మాఫియా దౌర్జన్యం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. సిపిఎం గా వామపక్షాలుగా మట్టి మాఫియా పై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేసినప్పుడు ప్రకటన చేసినప్పుడు తూతూ మంత్రంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారే తప్ప చిత్తశుద్ధతో వాటిని అడ్డుకట్ట వేయడం లేదని ప్రశ్నించారు. మట్టి మాఫియా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు మాకు అధికారులు అండ ప్రజా ప్రతినిధులు అండ ఉందని వారికి మేము మామూలు ఇస్తున్నామని బహిరంగంగా చెబుతూ అందరిని బెదిరిస్తున్నారు. ఇప్పటికే ఎల్ నిఓ ప్రభావం జిల్లాలో కరువు విలయ తాండవం చేస్తుంటే భూగర్భ డ్రైనేజీ అడుగింటిపోతున్న రైతులు పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది .దీనికి తోడు వీరు పర్యావరణాన్ని దెబ్బతీస్తూ భవిష్యత్తును నాశనం చేస్తున్న పరిస్థితి ఉంది. జిల్లా అధికారులు మట్టి మాఫియా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులపై చర్యలు తీసుకోవాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నది. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు


No comments:
Post a Comment