ఒంటరి మహిళపై అత్యాచారం
మద్యం మత్తులో మహిళపై యువకులు లైంగిక దాడి
బెజవాడ : (ఫస్ట్ న్యూస్ 4 యు) రాజమండ్రి గౌరీ పట్టణానికి చెందిన ఓ వివాహితకు 20 ఏళ్ల క్రిందట వివాహం అయింది. ఆమెకు 19 ఏళ్ల కొడుకు ఉన్నాడు. ఇటీవల భర్తతో గొడవపడి ఒంటరిగా విజయవాడకు వచ్చి.. వాంబే కాలనీలో నివాసం ఉంటుంది. అక్కడే ఉన్న హిజ్రాలతో కలిసి రోజు భిక్షాటనం చేసుకొని జీవనం సాగిస్తూ ఉండేది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఓ హిజ్రా పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని తిరిగి ఇంటికి వచ్చింది. కొంతసేపటికి ఎవరు ఇంటి తలుపులు దబ దబాదుతూ ఉండడంతో ఎవరు? ఎవరు? అంటూ తలుపు తీసింది. ఇద్దరు యువకులు మద్యం మత్తులో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. మరుసటి రోజు ఉదయం భిక్షాటనానికి రాకపోవడంతో హిజ్రాలు ఆమె ఇంటికి వెళ్లి చూడగా అపస్వారక స్థితిలో పడి ఉంది. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వైద్యుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తును ముమ్మరం చేసి అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు యువకులతో పాటు సహకరించిన మరో ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

No comments:
Post a Comment