Monday, 31 August 2026

చేతి వృత్తిదారుల సమస్యలను పరిష్కరించాలి

 చేతి వృత్తిదారుల సమస్యలను పరిష్కరించాలి

జిల్లా కలెక్టర్ గారికి ఏఐటీయూసీ విన్నతి 

చిత్తూరు: ఫస్ట్ న్యూస్ 4 యు 

చేతి వృత్తిదారుల సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ ఏఐటీయూసీ నాయకత్వంలో జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించారు 


ఈ సందర్భంగా ఏఐటీయూసీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు వి సీ గోపీనాథ్, చేతి వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి పి.రఘు ఏఐటీయూసీ నగర కార్యదర్శి దాసరి చంద్ర, కే.మణి,హెచ్. బాలాజీ రావు లు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించారు

ఈ సందర్భంగా గోపీనాథ్ రఘు  మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 రకాల చేతి  వృత్తి దారులు ఉన్నారని వారి సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని తీవ్రంగా విమర్శించారు 

చేతి వృత్తి దారుల సంక్షేమానికి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి, చేతి వృత్తి దారులకు ఉప ప్రణాళికను ఏర్పాటు చేసి చట్టబద్ధతను కల్పించి జనాభా ప్రాతిపదికన బడ్జెట్ లో నిధులను కేటాయించాలి, చేతి  వృత్తి దారులకు వయస్సుతో నిమిత్తం లేకుండా ఐదు లక్షల రూపాయలు 50% సబ్సిడీతో  బ్యాంకుల లింక్ లేకుండా సొంత  పూచీ కత్తుల తో కార్పొరేషన్ లోన్లు మంజూరు చేయాలి, ప్రైవేట్ రంగ సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలి, 50 సంవత్సరాలు వయసు దాటిన ప్రతి చేతి వృత్తిదారులకు 6000 పెన్షన్ మంజూరు చేయాలి, చేతి వృత్తి దారుల పిల్లలు కు కే.జీ నుండి పి.జి వరకు ఉచిత విద్యను అందించాలి, అర్హత గల  ప్రతి చేతి వృత్తి దారునికి పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు లు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు

No comments:

Post a Comment