Sunday, 30 August 2026

వీడిన మిస్టరీ....!

 తమిళనాడులో ఆంధ్ర మహిళ హత్య కేసు చేదించిన పోలీసులు. 

నిందితుడు అరెస్ట్ ...!

నగరి : ఫస్ట్ న్యూస్ 4 యు 

వారం రోజుల క్రితం తమిళనాడు రాష్ట్రం , తిరువల్లూర్ జిల్లా వెల్లా కులం సమీపంలోని ఒక ముళ్ళ పొదల్లో చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నిండ్ర మండలం  చవరంబాక్కం గ్రామానికి చెందిన అరుణపైన గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్ చల్లి, గొంతు నులిమి చంపిన ఆనవాళ్లు కనిపించింది. తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. 


నిందితుడి ఆచూకీ :


      

       వద్దత్తూరు గ్రామంలోని బందుల పెళ్ళికి వచ్చిన అరుణ హత్యకు గురైంది. ఆమె సెల్ఫోన్ ఆధారంగా వద్దత్తూర్, తామరంబాకం, వెళ్ళాకులం తదితర ప్రాంతాలలో సీసీ కెమెరా ఫుటేజ్ లను పరిశీలించారు. చివరికి ఆమెకు వచ్చిన సెల్ఫోన్ కాల్ ఆధారంగా భారతి రాజా (42) అనే నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో ఆమెకు భారతి రాజాకు మధ్య వివాహేతర సంబంధం గత కొంతకాలంగా నడుస్తోందని, వారం రోజుల క్రితం పెళ్ళికి వచ్చిన ఆమె అంతకుముందు తనకు ఇచ్చిన బంగారు నగలను తిరిగి అడగగా, ఇద్దరు మధ్య వివాదం మొదలైందని , కోపంతో ఆమె పైన యాసిడ్ చెల్లి గొంతు నులిమి హత్య చేసినట్లు నిందితులు నేరాన్ని అంగీకరించాడని పోలీసులు తెలిపారు. భారతి రాజాను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.

No comments:

Post a Comment