కళ్ళల్లో కారంపొడి చల్లి, ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన
ఆ ..ముగ్గురు....!
వ్యక్తిగత కారణాలే ఈ ఘాతకానికి కారణం !
కర్నూలు జిల్లాలో జరిగిన ఘటన
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు:
కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్న నరసమ్మ (30) పారిశుద్ధ్య కార్మికురాలుగా పనిచేస్తుంది. ఆమెకు ముగ్గురు పిల్లలు. ఇటీవల భర్త మరణించాడు. రోజు మాదిరిగానే ఆదివారం ఉదయం 5.30 లకు బస్టాండ్ వద్ద చెత్త ఊడుస్తూ ఉండగా ఉన్నపలంగా స్కూటీలో ఇద్దరు మహిళలు మరో బైక్ మీద ఒక వ్యక్తి ఆమె వద్దకు వచ్చి కళ్ళల్లో కారంపొడి చల్లి, ఆమె కళ్ళు తెరవ లేక విలవిలలాడుతూ ఉండగా ఒంటిపైన పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. అక్కడనుండి పరారైనారు. తోటి పారిశుద్ధ్య కార్మికురాలు గమనించి తన చీరతో ఆ మంటలను ఆర్పగా అప్పటికే 80% ఆమె శరీర భాగాలు కాలిపోయింది. చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.
ప్రాథమిక నిర్ధారణ :
నరసమ్మకు , చిన్న ఈరన్న అనే వ్యక్తి గత కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో జూలై 26 న చిన్న ఈరన్న ఇంట్లోనే బలన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో అతని భార్య శిరీష నరసమ్మ పైన పగబట్టింది. ఎలాగైనా పగ తీర్చుకోవాలి అన్న ఉద్దేశంతో తన స్నేహితురాలు మరో వ్యక్తితో కలిసి ఆదివారం ఉదయం ఈ ఘాతకానికి పాల్పడింది.

No comments:
Post a Comment