*గంగమ్మ జాతర మహోత్సవానికి మాజీ మంత్రి రోజాకు ఆహ్వానం*
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు
నగరి పట్టణం బజారు వీధిలో ఈ నెల 9వ తేదీన నిర్వహించనున్న శ్రీ గంగమ్మ జాతర మహోత్సవానికి మాజీ మంత్రి R.K. రోజా ని జాతర కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా జాతర కమిటీ సభ్యులందరూ ఈరోజు నగరిలోని మాజీ మంత్రి రోజా గారి నివాసానికి చేరుకుని, జాతర మహోత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆమెకు అందజేశారు. జాతర మహోత్సవంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కమిటీ సభ్యులు మాజీ మంత్రి రోజాని కోరారు. గంగమ్మ జాతర మహోత్సవం ఘనంగా, విజయవంతంగా జరగాలని మాజీ మంత్రి రోజా ఆకాంక్షించారు.


No comments:
Post a Comment