ఘనంగా గురుపూజోత్సవం
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటి సాధన కోసం కృషి చేయాలి.
------ ప్రిన్సిపల్ డాక్టర్ ధనంజయ
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు
నరసింగ రాయనపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భారతరత్న పూర్వభారత రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా గురుపూజోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమం లో మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటి సాధన కోసం దీక్షతో పనిచేయాలని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం వారి బాట నేటి విద్యార్థులకు స్ఫూర్తి అని తెలిపారు. కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ శరశ్చంద్రశేఖర్ ,మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించి మానవీయ విలువలను తన ఉపాధ్యాయ వృత్తి ద్వారా విద్యార్థులకు అనేకమంది రాజకీయ నాయకులకు సమాజానికి తెలిపిన గొప్ప తత్వవేత్తని వారి జీవితం సమాజానికి ఎంతో ఆదర్శవంతమైందని తెలుపుతూ గురువుల యొక్క ప్రాముఖ్యతను నేటి సమాజంలో వారి పాత్రను గురించి వివరించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు కళాశాల అధ్యాపకులు అందరికీ ఘనంగా సన్మానం చేశారు కార్యక్రమంలో కళాశాల లెక్చరర్లు వినాయక ఫయాజ్ లక్ష్మణ్ మహేష్ లావణ్య నారాయణి విద్యార్థులు రాకేష్ ,బాబు ,అజయ్,ప్రీథమ్ జేషు ఇతర విద్యార్థులు పాల్గొన్నారు


No comments:
Post a Comment