గుడిపాల మండలంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు
గుడిపాల : చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ శుక్రవారం సాయంత్రం గుడిపాల మండలంలో పలు గ్రామాల్లో పర్యటించి వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. శుక్రవారం సాయంత్రం గుడిపాల మండలం చీలాపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీ-సర్వే ప్రాజెక్టులో భాగంగా రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేశారు. అనంతరం సి.బండపల్లి గ్రామంలో నూతన తాగునీటి బోరును ప్రారంభించారు. గుడిపాల ఇందిరానగర్ కాలనీలో పైప్ లైన్లను, ముత్తువాళ్లూరులో వీధి దీపాలను ప్రారంభించారు. స్థానికంగా గ్రామాల్లో జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో తాహశీల్దారు శ్రీనివాసులు, మండల తెదేపా అధ్యక్షుడు సుబ్బానాయుడు, కూటమి నాయకులు బాలసుబ్రహ్మణ్యం యాదవ్ దీపశ్రీ, రూప్ కుమార్, పాల్గొన్నారు.

No comments:
Post a Comment