Saturday, 5 September 2026

ఉపాధ్యాయురాలు సురేఖకు ఉత్తమ అవార్డు

 మానసిక విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన
ఉపాధ్యాయురాలు సురేఖకు ఉత్తమ అవార్డు 
సిఐటియు అభినందనలు
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు 

ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పడంలో విశిష్ట సేవలు అందించిన జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు అందుకున్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి గిరిధర్ గుప్తా సతీమణి సురేఖకు సిఐటియు నుంచి అభినందనలు 



శనివారం చిత్తూరు జడ్పీ సమావేశ మందిరంలో ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా గంగవరం మండలంలో వికలాంగుల విద్యార్థిని విద్యార్థులకు విద్య నేర్పించడంలో అత్యుత్తమ సేవలందించిన ఉపాధ్యాయురాలు సురేఖకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు అందుకోవడం అభినందనీయం. జిల్లాలో మొత్తం 75 మందికి ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు ఉత్తమ అవార్డులు అందించడం జరిగింది. వివిధ రకాల రంగాలలో సేవలు అందించిన వారికి డాక్టర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదిన సందర్భంగా ఈ అవార్డులు ప్రధానం చేశారు. మామూలు పిల్లలకు విద్య నేర్పడం ఒక రకం అయితే మానసిక విద్యార్థులకు చదువు నేర్పడం మరో ఎత్తు అని పలువురు కొనియాడారు. చాలా కష్టంతో కూడుకున్న పని అయినప్పటికీ చాలా ఓపికతో మానసిక విద్యార్థిని విద్యార్థులకు చదువు చెప్పిన ఉపాధ్యాయురాలు  సురేఖ గొప్ప ఉపాధ్యాయురాలని కొనియాడారు. ఆమె అందరికీ ఆదర్శం అన్నారు.ఈమెను ఆదర్శవంతంగా తీసుకొని మిగిలిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కూడా పిల్లల భవిష్యత్తుకు కృషి చేయాలని తెలిపారు. 

ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు అందుకున్న సురేఖకు సిఐటియు జిల్లా కమిటీ నుంచి అభినందనలు తెలిపిన వారిలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి గిరిధర్ గుప్తా జిల్లా ఉపాధ్యక్షుడు వాడ గంగరాజు ,మాజీ జిల్లా కార్యదర్శి సురేంద్రన్ తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment