Wednesday, 2 September 2026

రీ -సర్వేలో తప్పులకుతావివ్వొద్దు

 రీ -సర్వేలో తప్పులకుతావివ్వొద్దు

జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్

చిత్తూరు, సెప్టెంబర్ 2: ఫస్ట్ న్యూస్ 4 యు 


రైతులకు శాశ్వత భూహక్కులు కల్పించే లక్ష్యంతో చేపడుతున్న రీ-సర్వే పనులను కచ్చితత్వంతో, పారదర్శకంగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్  అధికారులను ఆదేశించారు.



బుధవారం జీడి నెల్లూరు, కార్వేటినగరం, ఎస్ఆర్ పురం, మండలాలలో పలు అభివృద్ధి పనులను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు జీడి నెల్లూరు ఎంఆర్ఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రీ-  సర్వే, సర్వే రికార్డులు, పనుల పురోగతిని పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఆర్డీవో శ్రీనివాసుల నాయుడు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రీ -సర్వేలో ఎటువంటి తప్పులూ దొర్లకుండా క్షేత్రస్థాయిలో సర్వే, రెవెన్యూ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సరిహద్దు వివాదాలకు అవకాశం లేకుండా ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. నిర్దేశిత గడువులోగా రీ-సర్వే పనులు పూర్తి చేసి రైతులకు స్పష్టమైన హక్కు పత్రాలు అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడంతో పాటు రైతుల సందేహాలను అక్కడికక్కడే నివృత్తి చేయాలని ఆదేశించారు.

 జీడి నెల్లూరు మండలంలో రిసర్వ్ పనులు వేగవంతం చేయాలని రెవిన్యూ సిబ్బందిని ఆదేశించారు మండలంలోని 35 గ్రామాలలో  రీసెర్వె పనులు గ్రామ సభ్యులు నిర్వహించి రీ సర్వే సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. మండలంలో ఫేసు 4 కింద బుక్కపట్నం, వేపంజేరి, నందనూరు, గ్రామాలలో రీసెర్వె పనులు చేపట్టాలని ఆదేశించారు. ఫేస్ 5 కింద తుమగుండ్రం, జీడి నెల్లూరు, బుజ్జి వెజ్ పల్లి నాయన పల్లి, వెజ్ పల్లి గ్రామాలలో రీ సర్వే పనులు, మండల సర్వేయర్లు, గ్రామ సర్వేయర్లు టీమ్ గా ఏర్పడి  రీ సర్వే పనులు రెండు రోజుల్లోపు పూర్తిచేయాలని ఆదేశించారు. సుమారు రెండు వేల ఎకరాలు పెండింగ్లో ఉన్నాయని, తాసిల్దార్ లాగిన్ నుంచి ఆర్డిఓ లాగిన్ కి పంపవలనని సర్వేర్ లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో C.K. శ్రీనివాసులు, సర్వేయర్ గణేష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు


No comments:

Post a Comment