Sunday, 6 September 2026

ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి

 ఓలో రాపిడో వ్యవస్థను రద్దు చేయాలి 
ఉచిత బస్సుతో ఆటో డ్రైవర్ల ఆర్థిక స్థితి కుదేలు 
ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి 
_సంగం జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ డిమాండ్
 

చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు 


ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని ఆటో డ్రైవర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం గాంధీ విగ్రహం వద్ద ఆటో డ్రైవర్లతో కలిసి ఆయన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాపిడో ఓలో వంటి సంస్థలు విరివిగా రావడంతో ఆటో డ్రైవర్ల పరిస్థితి మరింత అద్వానంగా తయారైంది అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతోనే ఆటో డ్రైవర్ల ఆర్థిక పరిస్థితి సగం కుదేలైందని, ఇప్పుడు ఓలో రాపిడో వంటి సంస్థలు పుట్టగొడుగుల్లా రావడంతో ఆటో డ్రైవర్ల మనుగడ ప్రమాదకరంగా మారిందన్నారు. ఆర్థికంగా పూర్తిగా క్షీణించిపోయి కుటుంబం నడివీధిన పాలై పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి చర్యలు చేపట్టాలని ఓలో రాపిడో వంటి సంస్థలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.

No comments:

Post a Comment