ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలిసిన ఏపీడబ్ల్యూజేఎఫ్ నేతలు
విశాఖలో జరిగే రాష్ట్ర మహాసభలకు రావాలని ఆహ్వానం
చంద్రబాబు దృష్టికి జర్నలిస్టుల సమస్యలు
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడునీ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(APWJF) నేతలు కలిశారు. సచివాలయంలో ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఆంజనేయులు ఆధ్వర్యంలో నేతలు కలిశారు. విశాఖపట్నం వేదికగా త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర మహాసభలకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని ఆహ్వానించారు. పారిశ్రామిక రాజధాని విశాఖలో జరిగే రాష్ట్ర మహాసభలకు తప్పకుండా హాజరవుతానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల ప్రధాన సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి ఎపిడబ్ల్యుజేఎఫ్ నేతలు తీసుకువెళ్లారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలిసిన వారిలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్. వెంకట్రావు, రాష్ట్ర నాయకులు కలిమి శ్రీ, ఆనంద్, మీరా తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment