రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాలస్వామి
కృష్ణ విలాస సభ ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు
వైభవంగా వారోత్సవాలు ప్రారంభం
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు
చిత్తూరు నగరంలోని చర్చి వీధిలో వెలసిన రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాలస్వామి కృష్ణ విలాసభ ఆలయంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలను నిర్వహించారు. కళ్యాణ వేదికపై స్వామివారి ఉత్సవ మూర్తులకు చందన అలంకారంతో ప్రత్యేకంగా అలంకరించి ధూపదీప నైవేద్యంతో భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు మాట్లాడుతూ కృష్ణాష్టమి పురస్కరించుకొని వారం రోజులపాటు సంతాన వేణుగోపాలస్వామి కృష్ణ విలాస సభ ఆలయంలో వారోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా నాల్గవ తేదీ కృష్ణాష్టమి పురస్కరించుకొని స్వామివారికి చందన అలంకారము, 5 వ తేదీ 154 ఔషధ మూలికల ద్రవ్యాలతో విశేష అభిషేకము అనంతరం ప్రత్యేక అలంకారము, 6వ తేదీన కళ్యాణం ఉత్సవము,7 వ తేదీ సాయంత్రం ఉంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ, 8వ తేదీ పుష్ప పల్లకి లో మాడవీధుల్లో ఊరేగింపు కార్యక్రమం ఉంటుందన్నారు. పదవ తేదీ ఆలయం వద్ద ఉట్టి నిర్వహిస్తామన్నారు. భక్తులు కృష్ణాష్టమి వారోత్సవ వేడుకల్లో పాల్గొని స్వామి వారి కృపా కటాక్షానికి పాత్రులు కావాలని కోరారు.





No comments:
Post a Comment