Wednesday, 2 September 2026

చిత్తూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నూతన సిఐగా నరసింహ రాజు

నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు కృషి 

ప్రజల సహకారంతో ట్రాఫిక్ క్రంబద్దీకరణ 

- నూతన సీఐ నరసింహారాజు 

చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు 





చిత్తూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నూతన సిఐగా నరసింహ రాజు గురువారం పదవి బాధ్యతలు స్వీకరించారు. సాంప్రదాయ బద్దంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి , అనంతరం ట్రాఫిక్ ఎస్ఐ మహేష్ బాబు,  ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది నూతన సీఐ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన నర్సింహారాజుకు పండ్లు సమర్పించి దుశాల్వ కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను కానిస్టేబుల్ స్థాయి నుండి సీఐ స్థాయికి ఎదిగానని, అన్ని క్యాడర్ లలో ఉన్న సాధక బాధకాలు తనకు తెలుసు అన్నారు. తన సహచర సిబ్బందితోను, ప్రజలతోనూ ఫ్రెండ్లీ పోలీసింగ్ తో మెలగతూ నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు కృషి చేస్తానన్నారు. 



గతంలో సుమారు రెండున్నర సంవత్సరం పాటు వన్ టౌన్ సిఐగా పనిచేసిన అనుభవం ఉందని, జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు ట్రాఫిక్ సిఐగా తొలిసారి బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు. అందరి సహాయ సహకారాలతో నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు కృషి చేస్తామన్నారు. ప్రజల కూడా ట్రాఫిక్ పోలీసులకు సహకారాలు అందిస్తూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు.

No comments:

Post a Comment