గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం గుండ్లకట్టమంచి వద్ద జాతీయ రహదారిపై పొలం దగ్గర నుండి ఇంటికి వెళ్లేందుకు రోడ్డు ప్రక్కన నిల్చుని ఉండగా పలమనేరు వైపు నుండి చిత్తూరు వైపు వెళుతున్న వాహనం ఢీకొని సుమారు 20మీటర్ల దూరం లాక్కొని వచ్చి వెళ్లిపోవడం జరిగింది.ఈ ప్రమాదంలో గుండ్లకట్టమంచి హరిజన వాడకు చెందిన వెంకటేష్ అనే వ్యక్తి మృతి చెందడం జరిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments:
Post a Comment